Advertisement

  • పంజాబ్ రాజకీయాల్లో కరోనా కలకలం ..ఇప్పటికే 23 మంది ఎమ్యెల్యే లకు కరోనా పాజిటివ్

పంజాబ్ రాజకీయాల్లో కరోనా కలకలం ..ఇప్పటికే 23 మంది ఎమ్యెల్యే లకు కరోనా పాజిటివ్

By: Sankar Wed, 26 Aug 2020 8:15 PM

పంజాబ్ రాజకీయాల్లో కరోనా కలకలం ..ఇప్పటికే 23  మంది ఎమ్యెల్యే లకు కరోనా పాజిటివ్


పంజాబ్‌లో 23 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. రాష్ట్రంలోని మొత్తం 117 ఎమ్మెల్యేల్లో 23 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు.

శుక్రవారం ఒక రోజు అసెంబ్లీ నిర్వహణ నేపథ్యంలో ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా ఈ విషయం తెలిసిందన్నారు. ఈ నేపథ్యంలో కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్నవారినే అసెంబ్లీలోకి అనుమతిస్తామని ఆయన చెప్పారు. ఇంత భారీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకితే.. ఇక సాధారణ ప్రజల సంగతిని ఊహించవచ్చన్నారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బీజేపీయేతర ఏడు రాష్ట్రాల సీఎంల ఆన్‌లైన్ సమావేశంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు.

Tags :
|
|
|
|
|

Advertisement