2020లో వచ్చేది 74వ స్వాతంత్య్ర దినోత్సవం
By: chandrasekar Fri, 14 Aug 2020 09:55 AM
కరోనావైరస్ వల్ల 2020
దాదాపు నరకంగా మారింది అనేది నిజం. కానీ పండగల విషయంలో సెలబ్రేషన్స్ సమయంలో ఈ బాధలు కాస్త
పక్కనపెట్టేసి అన్ని నియమాలు పాటించి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం.
స్వాతంత్య్ర దినోత్సవం విషయంలో చాలా మందికి వచ్చే సందేహమే ఇది. మరి ఈ సారి వచ్చేది
73వ
స్వాతంత్య్ర దినోత్సవమా లేదా 74వ స్వాతంత్య్ర దినోత్సవమా తెలుసుకుందాం. చాలా మంది
స్వాతంత్య్ర దినోత్సవం విషయంలో కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ఎన్నో స్వాతంత్య్ర
దినోత్సవం అని తేల్చుకోలేకపోతుంటారు. భారత దేశంలో ప్రతీ ఏడాది ఆగస్టు 15న
స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు చేసుకుంటారు.
మనకు స్వాతంత్య్ర1947
ఆగస్టు 15న
వచ్చింది అంటే 1948కి
సంవత్సరం పూర్తి అవుతుంది. 1957కు పది సంవత్సరాలు. 1997లో యాబై సంవత్సరాలు. 2007లో 60
సంవత్సరాలు పూర్తి అవుతుంది. అంటే ఈ లెక్కన చూసుకుంటే 2020లో
వచ్చేది 74వ
స్వాతంత్య్ర దినోత్సవం అన్నమాట. అంటే మనం 73 సంవత్సరాలు
పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 74వ వడిలోకి చేరుకున్నాం.
మనకు స్వాతంత్య్ర
సిద్ధించి 73 సంవత్సరాలు 2020
సంవత్సరానికి పూర్తి అయింది. ఈ సారి మనం 74వ స్వాతంత్య్ర దినోత్సవం
చేసుకుంటున్నాం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ జెండాకు వందనం సమర్పించి, పరేడ్
తో పాటు పలు కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తారు. దేశ స్వాతంత్య్ర కోసం
ప్రాణ త్యాగం చేసిన అమర వీరుల త్యాగాలను
గుర్తు చేసుకుంటాం. వారి త్యాగాల నుంచి ప్రేరణ పొంది దేశాన్ని వారు కలలు
కన్న మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాం. అయితే ఈ సారి కరోనా వల్ల పరిమితంగా
వేడుకలు నిర్వహించనున్నారు.