ప్రముఖ బాలీవుడ్ నటికి ఏకంగా 20 సార్లు కరోనా టెస్ట్
By: chandrasekar Fri, 23 Oct 2020 09:24 AM
ప్రముఖ బాలీవుడ్ నటికి
ఏకంగా 20
సార్లు కరోనా టెస్ట్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20
సార్లు కరోనా టెస్ట్ చేయించుకుంది బాలీవుడ్ నటి ప్రీతిజింటా. అయితే ఇందుకు కారణం
వుందని ఈ అందాలభామ చెబుతుంది. ప్రస్తుతం నేను బయో బబుల్ సెగ్మెంట్లో వున్నాను.
దీని కోసం పలు మార్లు టెస్టులు చేసుకున్నట్లు చెపుతుంది.
కాగా, బయో
బబుల్ అంటే ఆరు రోజుల క్వారంటైన్ నుంచి ఇది ప్రారంభమవుతుంది. ప్రతి మూడు నాలుగు
రోజులకు కరోనా పరీక్షలుంటాయి. బయటికి వెళ్లడానికి వీలుండదు. నాతో పాటు నా సహచర, వ్యక్తిగత
ఉద్యోగులు కూడా బయోబబుల్లో వుండాల్సిందే. ఇతరులకు వ్యాపించకుండా జాగ్రత్త వహించడం
కోసమని తెలిపింది.
ఈ సమయంలో బయటి ఆహారం
తీసుకోకూడదు బయటి వ్యక్తులను కలవకూడదు కూడా అని చెప్పింది. అయితే ఇదంతా ఐపీఎల్
మ్యాచ్ల నిర్వహణలో భాగంగానే 20 సార్లు ప్రీతికి కరోనా టెస్టులు జరుగుతున్నాయి. ఆమె
కింగ్ ఎలెవన్ పంజాబ్ జట్టు కో ఓనర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.