Advertisement

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ పండు తినండి..

By: Sankar Tue, 13 Oct 2020 7:32 PM

రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ పండు తినండి..


కివీ పండును పళ్లలో రారాజుగా చెప్పొచ్చు. ఇదొక సాధారణ పండు కాదు. మిగిలిన పళ్లలో లేని ఎన్నో పోషక గుణాలు ఈ కివీ పండులో ఉన్నాయి.. కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి రోగి త్వరగా కోలుకోవడానికి వీలుపడుతుంది. ఈ కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతాయి.

1. సాధారణంగా నిమ్మ, నారింజ పళ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ కివీలో నిమ్మ, నారింజల కంటే రెండింతలు విటమన్ సి ఉంటుంది. 100 గ్రాముల కివీ పండులో 154 శాతం విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

2. రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి బాగా తగ్గిస్తాయి.

3. కివీ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

4. కివీ పండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. గర్భిణిలు కివీ పండ్లు తింటే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.

5. రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.

6. నిద్రలేమితో బాధపడుతున్న వారికి దీన్ని మించిన ప్రకృతి ఔషధం మరొకటి లేదు. దీనిలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. మీరు పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపోవడానికి ఇది ఎంతాగనో తోడ్పడుతుంది.

Tags :
|

Advertisement