- హోమ్›
- వినోదం›
- ప్రభాస్ ఆది పురుష్ సినిమా దర్శకుడు , విలన్ పై కోర్ట్ లో పెటిషన్ దాఖలు చేసిన యూపీకి చెందిన న్యాయవాది
ప్రభాస్ ఆది పురుష్ సినిమా దర్శకుడు , విలన్ పై కోర్ట్ లో పెటిషన్ దాఖలు చేసిన యూపీకి చెందిన న్యాయవాది
By: Sankar Thu, 17 Dec 2020 7:14 PM
బాహుబలి సినిమా తర్వాత తన రేంజ్ అమాంతం పెంచుకున్న టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ..అందులో భాగంగా ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నారు..అదే ఆది పురుష్ ..ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా , ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడు..
అయితే తాజాగా ‘ఆదిపురుష్’ చిత్రంపై ఉత్తప్రదేశ్కు చెందిన ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటూ సైఫ్ క్షమాపణలు కూడా చెప్పారు.
అయినప్పటికి ‘ఆదిపురుష్’ సినిమా దర్శకుడు ఓం రౌత్, సైఫ్పై యూపీకి చెందిన న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ బుధవారం జౌన్పూర్ కోర్టులో పిల్ వేశాడు. రావణుడిపై సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వసాలను దెబ్బ తీసేలా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. సైఫ్ అలీఖాన్తో పాటు దర్శకుడు ఓం రౌత్ పేరును కూడా పిటిషన్లో చేర్చారు.