జెర్సీ కోసం పారితోషికం రూ.8 కోట్లు తగ్గించుకున్న షాహీద్
By: chandrasekar Tue, 06 Oct 2020 1:08 PM
బాలీవుడ్ హీరో షాహిద్
కపూర్ జెర్సీ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ
సినిమా కోసం తన రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ముందుకు వచ్చాడు. విజయ్
దేవరకొండ హీరోగా వచ్చిన తెలుగు చిత్రం అర్జున్ రెడ్డి హిందీ వర్షన్ కబీర్ సింగ్ లో
నటించిన షాహీద్ మంచి విజయాన్ని సాధించాడు.
దాంతో జెర్సీ మూవీ కోసం
తన పారితోషికాన్ని రూ.33 కోట్లకు ఫిక్స్ చేశాడు. దాంతో పాటు లాభాల్లో వాటా
కూడా అడిగాడు. దీనికి నిర్మాతలు కూడా ఓ కె అనేసారు. కరోనావైరస్ కు ముందు ఈ డీల్
జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన పరిణామాల వల్ల సినిమా బడ్జెట్ లో నిర్మాతలు
కోతలు విధించారు. అందులో భాగంగానే షాహద్ కపూర్ కూడా పారితోషికం తగ్గించుకున్నాడు.
తన ఫీజులో రూ.8 కోట్లు తగ్గించుకోవడానికి షాహీద్ అంగీకరీంచాడు.
దీని వల్ల జెర్సీ మూవీకి
షాహీద్ రూ. 25 కోట్లు మాత్రమే తీసుకోనున్నాడు. కాగా టాలీవుడ్ లో
కూడా నటీనటులు, టెక్నీషియన్లు ఎవరైతే రూ.5 లక్షల
కన్నా ఎక్కువ పారితోషికం తీసుకుంటారో వారు 20 శాతం ఫీజు తగ్గించుకోవడానికి అంగీకరించారు. నానీ
హీరోగా వచ్చిన జెర్సీ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.