విరాటపర్వం"సినిమా లో ఓ విలక్షణ పాత్ర లో సాయి పల్లవి
By: chandrasekar Tue, 09 June 2020 11:49 AM
రానా హీరోగా 'విరాటపర్వం' పేరుతో
ఓ విలక్షణ కథాంశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు డైరెక్టర్ వేణు
ఉడుగుల. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా
సమర్పిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి ముఖ్యపాత్రలో కనిపించనుంది. ఆమె రోల్ గతంలో
ఎన్నడూ చూడని విధంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని వార్తలు వచ్చాయి.
తాజాగా ఆ వార్తలను నిజం చేసేలా తన సినిమాకు సాయి పల్లవే మేజర్ అసెట్ అని చెప్పారు
డైరెక్టర్ వేణు ఉడుగుల.
విరాటపర్వం సినిమా కోసం హీరోయిన్ పాత్రను రాసుకున్నప్పుడే సాయి
పల్లవిని తీసుకోవాలని డిసైడ్ అయ్యానని, ఈ పాత్రకు సాయి పల్లవినే న్యాయం చేయగలదని భావించానని
వేణు చెప్పారు. ఆమెను కలిసి కథ వినిపించానని, కథ వినగానే వెంటనే ఒప్పుకున్న సాయి పల్లవి
అనుకున్నట్లుగానే ఆమె అద్భుత నటన కనబర్చిందని అన్నారు. ఈ సినిమాకు సాయి పల్లవి ఓ
అసెట్ అని ఈ సందర్భంగా తెలిపారు.
విరాటపర్వం నుంచి ఇటీవలే
విడుదలైన సాయి పల్లవి ఫస్ట్లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మెరూన్
కలర్ లంగావోణీ ధరించి పక్కనే బ్యాగ్ పెట్టుకొని అడవిలో అమరవీరుల స్మారక చిహ్నం
వద్ద కూర్చొని కనిపించిన సాయి పల్లవి తన రోల్ పట్ల ఆసక్తి రేకెత్తించింది.
నక్సలిజం నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీ
రావు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్
చేసుకున్న ఈ మూవీ క్లైమాక్స్కి చేరింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ రద్దు
కావడంతో కొంతభాగం షూటింగ్ పెండింగ్లో ఉంది. అతి త్వరలో ఇది కూడా ఫినిష్ చేసి
రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.