Advertisement

గుడ్ న్యూస్... గుడ్ న్యూస్...!

By: Anji Mon, 30 Nov 2020 07:35 AM

గుడ్ న్యూస్... గుడ్ న్యూస్...!

పసిడి పడిపోతూనే వస్తోంది. బంగారం ధర మరోసారి వెలవెలోబోయింది. ఈరోజు కూడా తగ్గింది. బంగారం ధర దిగిరావడం పసిడి కొనుగోలుదారులకు ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. అం

మార్కెట్లో బంగారం, వెండి ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.480 పడిపోయింది. రూ.49,100కి క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.440 తగ్గుదలతో రూ.45,010కు పడిపోయింది.


బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం నిలకడగానే కొనసాగింది. ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో వెండి ధర రూ.64,700 వద్దనేు స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది. 1800 డాలర్ల కిందనే కదలాడుతోంది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గుదలతో 1785 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.11 శాతం తగ్గుదలతో 22.61 డాలర్లకు క్షీణించింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Tags :
|

Advertisement