Advertisement

రూ.8 వేలకు పైగా పడిపోయిన బంగారం ధర...!

By: Anji Sat, 26 Dec 2020 07:54 AM

రూ.8 వేలకు పైగా పడిపోయిన బంగారం ధర...!

బంగారం ధర ఈ ఏడాది ఆల్‌టైమ్ గరిష్టాలను తాకింది. కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లింది. ఆగస్ట్ నెలలో పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది.

అయితే అప్పటి నుంచి మళ్లీ బంగారం ధర తగ్గుతూ వచ్చింది. దాదాపు 15 శాతం మేర పడిపోయింది. ఆగస్ట్ 8న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,130కు చేరింది. ఇప్పుడు పసిడి రేటు రూ.50,940కు తగ్గింది. అంటే దాదాపు రూ.8 వేలకు పైగా పడిపోయింది.

కరోనా వైరస్ కారణంగా పసిడి రేటు పరుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు బంగారం కొంటే మంచిదా? ఇంకొన్ని రోజులు అంటే కొత్త ఏడాదిలో పసిడి కొనుగోలు చేయవచ్చా? సమీప కాలంలో బంగారం ధరలో హెచ్చతగ్గులు ఉండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ పసిడిపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. 2020 అమెరికా ఎన్నికలు, కరోనా వైరస్ కారణంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల బంగారం ధర పరుగులు పెట్టిందని తెలిపారు. అందుకే 25 శాతం పెరిగిందని పేర్కొన్నారు.

అయితే 2021లో ఇలాంటి పరిస్థితులు ఉండబోవని, అందువల్ల బంగారం ధర పెరుగుదల కూడా ఉండకపోవచ్చని వివరించారు.

అంతేకాకుండా కొత్త ఏడాదిలో ఈక్విటీ మార్కెట్లు బంగారం కన్నా అధిక రాబడి అందించొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.

అందువల్ల ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లవైపు మొగ్గు చూపే అవకాశముంది. అందువల్ల పసిడి వెలవెలబోవచ్చు. దీని వల్ల బంగారం రేట్లపై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది.

Tags :

Advertisement