- హోమ్›
- బిజినెస్ ›
- ఆన్లైన్లో ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే... రోజుకు రూ.100...!
ఆన్లైన్లో ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే... రోజుకు రూ.100...!
By: Anji Sat, 05 Dec 2020 3:43 PM
మనం తరుచుగా ఆన్లైన్లో ఎవరికైనా డబ్బులు పంపిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇలా డబ్బులు పంపించేటప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావొచ్చు.
ఇలాంటిప్పుడు మీ అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి. కానీ అవతలి వారికి డబ్బులు పోవు. దీంతో ఇబ్బంది పడాల్సి రావొచ్చు.
మీ అకౌంట్లో కట్ అయిన డబ్బులు అవతలి వారి బ్యాంక్ ఖాతాలోకి అదే రోజు కాకుండా తర్వాతి రోజున పడిపోయినా పెద్దగా సమస్య లేదు. లేదంటే మీ అకౌంట్ డబ్బులు మీకే వెనక్కి వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కానీ కట్ అయిన డబ్బులు ఎన్ని రోజులైనా ఎవ్వరి అకౌంట్లోకి వెళ్లకపోతేనే అసలు సమస్య. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు వారం రోజుల్లోగా మీ డబ్బులు మీకు రావాలి. లేదంటే మీకు ప్రతి రోజూ బ్యాంక్ నుంచి రూ.100 పరిహారం లభిస్తుంది.
మీ డబ్బులు మీకు రాకపోతే మీరు మీ యూపీఐ యాప్కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. పేమెంట్ హిస్టరీలోకి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఇలా చేస్తేనే మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి.
ఆలస్యం అయ్యే కొద్ది అంటే 7 రోజులు దాటినా సమస్య పరిష్కారం కాకపోతే (మీ డబ్బులు వెనక్కి రాకపోతే) బ్యాంక్ మీకు రోజుకు రూ.100 చెల్లిస్తుంది.
బ్యాంక్ నుంచి పరిహారం పొందాలని భావిస్తే.. మీకు కచ్చితంగా ఫిర్యాదు చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
ఒకవేళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కాకుండా ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే.. అప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్, ఏటీఎం స్లిప్ తీసుకొని బ్యాంక్కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం ఎక్కువగా ఉంది.