Advertisement

బంగారం ప్రియులకు అదిరిపోయే బాంఫర్ ఆఫర్...!

By: Anji Tue, 01 Dec 2020 9:06 PM

బంగారం ప్రియులకు అదిరిపోయే బాంఫర్ ఆఫర్...!

బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.

ప్రముఖ జువెలరీ సంస్థ తనిష్క్ పసిడి ప్రియుల కోసం కొత్త జువెలరీని అందుబాటులోకి తీసుకువచ్చింది. రివాహ్ ఆశీర్వాద్ జువెలరీ దీని పేరు. ఇది మంత్లీ పర్చేజ్ ప్లాన్.

10 నెలల తర్వాత బంగారం కొనుగోలు చేయాలని భావించే కస్టమర్లకు రివాహ్ ఆశీర్వాద్ పర్చేజ్ ప్లాన్‌ అనువుగా ఉంటుంది.

ఏడు నెలల తర్వాతి నుంచి నచ్చిన ఆభరణాలను కనుగోలు చేయొచ్చు. ఈ ప్లాన్‌లో చేరిన వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంటుంది.

గోల్డ్ జువెలరీ మేకింగ్ చార్జీలపై ఏకంగా 40 శాతం వరకు తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. ఆరో కంతు చెల్లించిన తర్వాత మీకు మెకింగ్ చార్జీలపై 10 శాతం తగ్గింప వస్తుంది.

మీ నెలవారీ కంతు రూ.20,000 నుంచి రూ.49,000 మధ్యలో ఉండాలి. అదే మీ నెలవారీ కంతు రూ.50,000 లేదా ఆపైన ఉంటే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

మీరు ఏడో ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లిస్తే.. మీకు 15 శాతం డిస్కౌంట్ వస్తుంది. రూ.20 వేల నుంచి రూ.49 వేల మధ్యలో చెల్లించే వారికి ఇది వర్తిస్తుంది.

రూ.50 వేలు, ఆపైన ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించే వారికి 25 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇలా ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్ పెరిగే కొద్ది డిస్కౌంట్ కూడా పెరుగుతుంది.

పదో ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లిస్తే అప్పుడు గోల్డ్ జువెలరీ తయారీ చార్జీలపై 30 శాతం తగ్గింపు వస్తుంది. రూ.20 వేల నుంచి రూ.49 వేల మధ్యలో ఇన్‌స్టాల్‌మెంట్ ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. అదే రూ.50 వేలు లేదా ఆపైన ఇన్‌స్టాల్‌మెంట్ ఉంటే 40 శాతం డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు.

Tags :

Advertisement