Advertisement

విజయ దశమి పండుగ విశిష్టత ..ఎందుకు జరుపుకుంటారో తెలుసా!

By: Sankar Sun, 25 Oct 2020 4:45 PM

విజయ దశమి పండుగ విశిష్టత ..ఎందుకు జరుపుకుంటారో  తెలుసా!


దేశం మొత్తం జరుపుకునే పండుగలలో దసరా ఒకటి ..విభిన్న రాష్ట్రాలు , విభిన్న ఆచారాలు ఉన్నప్పటికీ దసరా పండుగను మాత్రం దేశం అంత ఎంతో వైభవంగా జరుపుకుంటారు..ఆశ్వయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులను శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి మూడు రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాధలు, చరిత్ర ఉన్నాయి.

శమీ పూజ దశమి రోజు ఎంతో ప్రత్యేకమైంది. శమీ వృక్షమంటే జమ్మిచెట్టు. పాండవుల అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీవృక్షంపైనే దాచిపెట్టారు. ఈ సమయంలో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు.. ఏడాది అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి తిరిగి ఆయుధాలను పొందుతారు. శమీవృక్ష రూపంలో అపరాజితా దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధిస్తారు.

రాముడు విజయదశమి నాడే అపరాజితా దేవిని పూజించి.. రావణుడిని సహరించాడు. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్టను చూసే సంప్రదాయముంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తారు..

దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవి పూజా ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. దేవదానవులు పాల సముద్రం మధించినప్పుడు అమృతం జన్మించిన శుభముహూర్తాన్నే విజయదశమీగా పేర్కొన్నారు.

దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధమముంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభసూచికంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఇదే రోజు రావణాసురుడిని అంతమొందించిన శ్రీరాముడు యుద్ధంలో ఘనవిజయం సాధించాడు. మహిషారుడి వధ లాంటి విజయాలు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు

Tags :
|

Advertisement