Advertisement

మూడో రోజు నెమలి వాహనంపై ఆలయ మండపంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు విఘ్నేశ్వరుడు

By: chandrasekar Tue, 25 Aug 2020 2:25 PM

మూడో రోజు నెమలి వాహనంపై ఆలయ మండపంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు విఘ్నేశ్వరుడు


శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కాణిపాకంలో వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు విఘ్నేశ్వరుడు నెమలి వాహనంపై ఆలయ ప్రకారమండపంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవకు కాణిపాకం, ఆగరంపల్లె, చినకాంపల్లె,కొత్త పల్లె కు చెందిన గ్రామస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ముందుగా మూల విరాట్ కు అభిషేకాదులు నిర్వహించి అనంతరం అలంకార మండపంలో ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ స్వామివారిని వివిధ రకాల పువ్వులతో అలంకరించారు.

తరువాత నెమలి వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి దీప, ధూప, నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు, ఉభయదారులు సంయుక్తంగా స్వామివారిని వారి భుజస్కంధాలపై మోస్తూ మేళతాళాలు మంగళ వైయిద్యాల నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు.

భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో వెంకటేష్, AEO విద్యాసాగర్ రెడ్డి,SUP కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిషోర్ రెడ్డి మరియు ఆలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఈ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగలా జరిగేవి. ఈసారి మాత్రం కరోనా ఆంక్షలు అమల్లో ఉండడం వల్ల ఉత్సవాలు ఆలయం వరకే పరిమితమయ్యాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.

Tags :

Advertisement