ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

గుంటూరు జిల్లా అమరావతిలో ఘోరం చోటుచేసుకుంది. ఓ ప్రేమికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడికొండూరుకు చెందిన యూవకుడు తన ప్రేమ విఫలమైందని శివరామకృష్ణ (24) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తన ప్రేమను యువతి అంగీకరించక పోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి శివరామకృష్ణ మృతి చెందాడు. ఊరు బయట పాడుబడిన వాటర్ ట్యాంక్ నందు మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.