కోవిడ్19 నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా డిగ్రీలు ఇవ్వలేమన్నారు. అయితే ఈ కేసును సుప్రీంకోర్టు ఆగస్టు 14కు వాయిదా వేసింది. కోవిడ్ నేపథ్యంలో యూజీసీ ఫైనల్ ఇయర్ పరీక్షలను రద్దు చేయాలని ఇటీవల మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం పట్ల స్పందించేందుకు యూజీసీకి సుప్రీం కొంత గడువును ఇచ్చింది.
అశోక్ భూషన్, సుభాష్ రెడ్డి, షాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. సెప్టెంబర్ 30వ తేదీలోగా పరీక్షలు నిర్వహించాలని గతంలో యూజీసీ చెప్పింది. యూజీసీ మార్గదర్శకాలను డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఓవర్రైడ్ చేస్తుందా అని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. విద్యార్థులు చదువుతూనే ఉండాలని, కానీ వాళ్లు పరీక్షలు రాయనంత వరకు వారికి డిగ్రీలు ఇవ్వలేరని మెహతా తెలిపారు.