ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లేన్ మాక్స్ వెల్ మీద మరొకసారి తీవ్ర విమర్శలు చేసాడు టీం ఇండియా మాజీ ఆటగాడు డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ...అందుకు కారణం లేకపోలేదు ..ఈ ఏడాది జరిగిన ఐపీయల్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున బరిలోకి దిగిన మాక్స్ వెల్ ఘోరంగా విఫలం అయ్యాడు ..
పదమూడు మ్యాచ్ లు ఆది ఒక్కటంటే ఒక్క సిక్స్ కూడా బాధలేకపోయాడు..ఇక అన్ని మ్యాచ్ లు కలిపి అతడు చేసిన పరుగులు 108 మాత్రమే ..ఇక ఐపీయల్ కు ముందు సూపర్ ఫామ్ లో ఉన్న మ్యాక్సీ ఐపీయల్ లో మాత్రం దారుణంగా విఫలం అయ్యాడు ..ఇక ఐపీయల్ ముగిసిన వెంటనే ఇండియాతో జరుగుతున్న వన్ డే , టి ట్వంటీ సిరీస్ లో కూడా బౌలర్లకు చుక్కలు చూయించాడు..దీనితో సెహ్వాగ్ మ్యాక్సీ మీద తీవ్ర విమర్శలు చేసాడు..
ఎంజాయ్ చేయడానికి, హోటల్లో లభించే ఉచిత పానీయాలు తాగి ఆస్వాదించడానికే మ్యాక్స్వెల్ ఐపీఎల్ ఆడుతున్నాడని వీరూ ఘాటుగా విమర్శించాడు. ఐపీఎల్ అతనికి పారితోషికం తీసుకొనే ఒక విహారయాత్రగా మారిందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు ...