కెసిఆర్ ను నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు ...విజయశాంతి


ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీ లో జాయిన్ అయిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి మరొకసారి సీఎం కెసిఆర్ మీద ఫైర్ అయ్యారు...మోసాల కేసీఆర్‌ను ఢిల్లీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదని విజయశాంతి ఆరోపణలు చేశారు.

సీఎం హోదాలో అపాయింట్‌మెంట్‌ తీసుకుని.. ప్రజలకు బకరాలను చేసేందుకు ఈ ప్రయత్నం చేశారని ఆగ్రహించారు. త్వరలో అవినీతి ఆరోపణలు రుజువవుతాయని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వం కూలడం ఖాయమని హెచ్చరించారు. ప్రజలు మార్పుకోరుకుంటున్నారని... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీ రైతుల సంక్షేమానికి ఎంతోగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలు రైతులకు ఎంతోగానో మేలు చేస్తాయని తెలిపారు.