హైదరాబాద్లో జరుగుతున్న
వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొన్న టాలీవుడ్ బ్యూటీ తమన్నాకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా
నుండి బయట పడేందుకు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటనే అడ్మిట్ అయి
చికిత్స తీసుకున్నాను. నిపుణులైన డాక్టర్ల సంరక్షణలో చికిత్స తీసుకున్న అనంతరం
డాక్టర్ల సలహాతో నేనిప్పుడు డిశ్చార్జ్ అయ్యానని తమన్నా ఇప్పటికే తెలిపింది.
అయితే తమన్నా త్వరగా
కరోనా నుంచి కోలుకోవడం వెనుక ఒకరు ఉన్నారట. అది ఎవరో కాదు టాలీవుడ్ నటుడు
రాంచరణ్ సతీమణి కొణిదెల ఉపాసన.
తమన్నా తనకు మంచి
ఫ్రెండ్ కావడంతో ఉపాసన వెంటనే అపోలో ఆస్పత్రికి పంపించి తమన్నాకు మంచి
చికిత్సనందించడమే కాకుండా ఆమె ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుందట. ఉపాసన
తీసుకున్న స్పెషల్ కేర్ వల్లే తమన్నా త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి
డిశ్చార్జయిందన్నమాట. మొత్తానికి తన స్నేహితురాలికి కష్టకాలంలో అండగా
నిలిచారు ఉపాసన.