ఐపీల్ 2020 లో భాగంగా
ఈ రోజునుండి ఐపీల్ లో రెండు మ్యాచులు జరగనున్నాయి. ఇందులో RR vs RCB మరియు DD vs KKR పోటీ
పడనున్నాయి. రెండు వారాలుగా ఐపీఎల్ను ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్కు డబుల్
కిక్ లభించనుంది. ఇప్పటిదాకా రోజుకో
మ్యాచ్ చొప్పున ధనాధన్ లీగ్ను ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ కోసం నాలుగు జట్లు రెడీ
అవుతున్నాయి. ఐపీఎల్ 13లో
శనివారం తొలి డబుల్ హెడర్ జరగనుంది. ఫస్ట్ రాజస్తాన్ రాయల్స్– రాయల్
చాలెంజర్స్ బెంగళూరు ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్– కోల్కతా నైట్రైడర్స్ పరుగుల
విందు అందించనున్నాయి. ఐపీఎల్ 13లో మొత్తం పది డబుల్ హెడర్లు ఉండగా ఈ వీకెండ్
నుంచి ఈ డబుల్ ఫీస్ట్ స్టార్ట్ అవ్వనుంది. రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్యాహ్నం అబుదాబిలో
అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇన్నాళ్లూ లీగ్లో ప్లేయర్లను మంచు ఇబ్బంది
పెట్టగా ఇప్పుడు ఉక్కపోత సవాల్
విసరనుంది. ఇదికాక షార్జా, దుబాయ్తో
పోలిస్తే అబుదాబిలోని షేక్ జియెద్ స్టేడియం పెద్దది కావడం మరో చాలెంజ్.
ఇన్ని రోజులు ఒక్క మ్యాచ్
మాత్రమే ప్రతి రోజు నిర్వహించారు. ఈ రోజునుండి రెండు మ్యాచులు ఆడనున్నారు. లీగ్లో
ఇప్పటిదాకా మూడు మ్యాచ్లాడిన ఇరుజట్లు చెరో రెండు విజయాలు సాధించాయి. వరుస
విజయాలతో లీగ్ను సూపర్గా మొదలుపెట్టిన రాయల్స్ బుధవారం కోల్కతాతో జరిగిన
మ్యాచ్లో తేలిపోయింది. దీంతో ఆ జట్టు
కొంచెం ఒత్తిడిలో ఉంది. కెప్టెన్ స్టీవ్
స్మిత్, బట్లర్, సంజూ
శాంసన్ మరోసారి బ్యాటింగ్లో కీలకం కానున్నారు. వరుసగా ఫెయిలవుతున్న రాబిన్
ఊతప్ప ప్లేస్లో యశస్వి జైస్వాల్, బౌలర్లలో
అంకిత్ రాజ్ఫుత్ స్థానంలో వరుణ్ ఆరోన్ తుది జట్టులోకి రావొచ్చు.
ఇక, ముంబై
పై సూపర్ ఓవర్లో నెగ్గిన బెంగళూరు ఫుల్ జోష్లో ఉంది. కెప్టెన్ విరాట్
కోహ్లీ ఫామ్ తప్ప ఆ జట్టుకు పెద్దగా సమస్యల్లేవు. కోహ్లీ టచ్లోకి వస్తే ఆర్సీబీ వెనుదిరిగి చూసుకోవాల్సిన పని లేదు.
ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ కూడా అందుబాటులోకి వస్తే జట్టు బలం పెరగనుంది. పెద్దగా
ఊహించిన చెన్నై జట్టు వరుస అపజయాలతో వెనుకబడింది.