గంధలమల చెరువు ఉదృత్తంగా ప్రవహిస్తున్న నీటిలో రెండు బైక్‌లు గల్లంతు


బుధవారం తుర్కపల్లి మండలంలోని గంధలమల చెరువు మత్తడి వరద కాల్వలో పడి రెండు బైక్‌లు గల్లంతయ్యాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి కాల్వ ద్వారా వస్తున్న వరద నీటితో గంధమల్ల చెరువు నిండి పోయింది.

తుర్కపల్లి నుంచి గంధమల్ల గ్రామానికి అలుగులోంచి దారి ఉంది. ఈక్రమంలో తుర్కపల్లి నుంచి మదర్‌ డెయిరీ సిబ్బంది బొత్త మహేశ్‌, మధులు ఒక బైక్‌పై గంధమల్లకు చెందిన శాగర్ల వెంకటేశ్‌, మరో బైక్‌పై గ్రామానికి వెళ్తున్నారు.

గంధలమల్ల చెరువు మత్తడి నుంచి ఉదృత్తంగా ప్రవహిస్తున్న నీటిలో పడి రెండు బైక్‌లు కొట్టుకుపోగా బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు అతి కష్టంగా బయట పడ్డారు.