అమెరికా అధ్యక్షుడు
డోనాల్డ్ ట్రంప్కు తొలిసారి ట్విట్టర్ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ట్రంప్ చేసిన
ట్వీట్ అందర్నీ తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆ సంస్థ తన వార్నింగ్లో పేర్కొన్నది.
మెయిల్ బ్యాలెట్లతో ఫ్రాడ్ జరుగుతుందని ట్రంప్ చేసిన ట్వీట్స్ను
మైక్రోబ్లాగింగ్, సోషల్
నెట్విర్కింగ్ సర్వీస్ ట్విట్టర్ సంస్థ తప్పుపట్టింది.
మెయిల్ బ్యాలెట్ల
ట్వీట్లు రెండింటికి ఆ సంస్థ వార్నింగ్ లేబుల్ ఇచ్చింది. కొత్త పాలసీ ప్రకారం
ట్విట్టర్ ఆ హెచ్చరిక చేసింది. ట్విట్టర్ సంస్థ చేసిన వార్నింగ్ పట్ల ఆ తర్వాత
ట్రంప్ కూడా స్పందించారు. భావస్వేచ్ఛను అడ్డుకోవడమే అంటూ ట్విట్టర్ సంస్థపై
ట్రంప్ ఫైర్ అయ్యారు.
ట్రంప్ చేసిన ట్వీట్ల
కింద బ్లూమార్క్ చేశారు. వాస్తవాలు తెలుసుకోవాలని ఆ హెచ్చరికల్లో రాశారు.
ఎవరైనా తప్పుడు సమాచారం
కానీ, తప్పుదోవ పట్టించే సమాచారం కానీ పోస్టు చేస్తే, వారికి వార్నింగ్ ఇచ్చే విధంగా ట్విట్టర్ కొత్త
మార్పులు తీసుకువచ్చింది. నెల క్రితమే వార్నింగ్లకు సంబంధించి ట్విట్టర్
కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఈ ఏడాది నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ సంస్థ
జోక్యం చేసుకుంటున్నట్లు ట్రంప్ ఆరోపించారు.