తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధికి ఇ-హుండీ సౌకర్యం కల్పించిన టీటీడీ


ప్రజల సౌకర్యార్థం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఇ-హుండీ సౌకర్యాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా కారణంగా దర్శనానికి రాలేని భక్తులు ఇ-హుండీ ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మవారికి కానుకలు సమర్పించవచ్చని సూచించింది.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి కానుకలు సమర్పించుటకు www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారాగానీ, గోవింద మొబైల్‌ యాప్‌ ద్వారా గానీ భక్తులు కానుకలు చెల్లించవచ్చని ఆలయ అధికారులు వెల్లడించారు. టీటీడీ తీసికొచ్చిన ఈ సౌకర్యాన్ని భక్తులందరూ వినియోగించుకోవాలని తెలియజేసారు.

వెబ్‌సైట్‌, యాప్‌లో ఇదివరకే నమోదు చేసుకున్న భక్తులతో పాటు ఇప్పటివరకు నమోదు చేసుకోని వారు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. పేరు, ఇ-మెయిల్‌, మొబైల్‌ నంబరు,చిరునామా తదితర వివరాలు పొందుపరిచి డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డుతో కానుకలను సమర్పించవచ్చని సూచించింది.