టీఎస్ ఎంసెట్-2020 ఫలితాలు విడుదల
తెలంగాణ: టీఎస్ ఎంసెట్-2020 ఫలితాలు
విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా
ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.
జేఎన్టీయూ క్యాంపస్లో జరిగిన
ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్
కన్వీనర్ గోవర్ధన్తో పాటు పలువురు హాజరయ్యారు.
ఎంసెట్ ఇంజినీరింగ్
విభాగంలో 89,734 మంది (75.29 శాతం) ఉత్తీర్ణత సాధించారు.