తెలంగాణలో నేడు మరో 2,273 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుంది. ప్రజలలో మళ్లీ ఆందోళన ప్రకంపనలు లేపుతుంది అని చెప్పుకోవాలి. తాజాగా రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటలలో 2,273 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 12 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 2,260 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,62,844 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 1,31,447 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 30,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 996 కి చేరింది.

ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 55,636 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 22,76,222 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 80.71 శాతం ఉండగా, మరణాల రేటు 0.61% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.