అమెరికాలోని టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
వీరంతా నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో భార్యాభర్తలు జీ నర్సింహా రెడ్డి, లక్మి, కుమారు భరత్ రెడ్డి మృతిచెందగా, కూతురు మౌనికా రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నది. ఉపాధి కోసం అమెరికా వెళ్లినవారు ఒకే ప్రమాదంలో మరణించడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంలో గాయపడిన మౌనికారెడ్డిని హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు