ఒకేసారి ముగ్గురు కవలలకు పెళ్లి ...కేరళలో జరిగిన అరుదయిన సంఘటన


కేరళలో ఓ వింత జరిగింది. ఒకే వేదికపై ఏకంగా ముగ్గురు కవలలకు ఒకే టైంలో పెళ్లి జరిగింది. వివరాల్లోకి వెళితే..కేరళలోని తిరువనంతపురానికి చెందిన రమాదేవి అనే మహిళా 1995 నవంబర్ 18 న ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. వారిలో నలుగురు ఆడపిల్లలు కాగా..ఒకరు మగ పిల్లగాడు.

ఈ శిశువులకు ఉత్తర, ఉత్తమ, ఉత్ర, ఉత్రజా, ఉత్రజన్ అనే పేర్లు పెట్టారు తల్లిదండ్రులు. అంతేకాదు వీరి గురించి వార్త పత్రికల్లో చాలా కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఆ నలుగురు కవల యువతుల్లో ముగ్గురికి ఒకే వేదికపై వివాహం జరిగింది. నలుగురు యువతులకు ఒకేసాఆరి నిశ్చితార్థం జరిగినప్పటికి ముగ్గురికి మాత్రమే ఒకేసారి వివాహం జరిగింది.

ఇంకో యువతిని చేసుకోబోయే వరుడు కువైట్ నుంచి సమయానికి రాకపోవడంతో ముగ్గురి వివాహమే జరిగింది. ఒకేసారి తమ ముగ్గురు కూతుళ్ళ పెళ్లి జరగడంతో తల్లి రమాదేవి ఎంతో సంతోష పడుతోంది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నప్పటికీ..పిల్లలను కస్టపడి పెంచానని..అందరికి ఉద్యోగాలు వచ్చాయని తల్లి రమాదేవి పేర్కొంది.