శ్రీశైలం ఆలయంలో కరోనా
వైరస్ విజృంభణ కారణంగా మరో వారం రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ
ఈవో రామారావు వెల్లడించారు.
కరోనా కట్టడిలో భాగంగా ఈ
నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అయితే ఆలయంలో యథావిధిగా స్వామివారి నిత్య
కైంకర్యాలు, పరోక్ష సేవలను కొనసాగిస్తామని వివరించారు.
ఆలయ సిబ్బందికి కరోనా
సోకగా ఈ నెల 15 నుంచి
ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు.
ముందుగా వారం రోజులే
ఆలయంలో దర్శనాలను ఉండవని ప్రకటించినప్పటికీ కరోనాను కట్టడి చేసేందుకు మరో వారం
పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఈవో చెప్పారు.