బీజేపీ జాతీయ అధ్యక్షుడు
జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది.
కొందరు ఆందోళనకారులు నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్పై రాళ్ల దాడి చేశారు.
ఈ దాడిలో కొన్ని వాహనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.
ఘటన అనంతరం జేపీ నడ్డా
మాట్లాడుతూ... దుర్గా మాతా ఆశీస్సులతోనే నేను ఇవాళ బయట పడ్డానని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన కోల్కతాలోని డైమండ్ హార్బర్కు వెళ్తుండగా ఈ
ఘటన జరిగింది.
ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త
వాతావరణం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులే ఈ దాడికి పాల్పడినట్లు భాజపా
బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. జేపీ నడ్డా వస్తున్నారనే సమాచారం
తెలుసుకొని బుధవారం ఉదయం రహదారిని
దిగ్బంధించిన కొంత మంది ఆందోళనకారులు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. అనంతరం
వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో బీజేపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గియా కారు ధ్వంసమైనట్లు తెలిపారు.