ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు టెక్నాలజీ వినియోగంలో అవార్డుల వచ్చి చేరాయి. జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్శాఖ పది అవార్డులను సొంతం చేసుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 26 అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా వివిధ విభాగాల్లో మరో పది అవార్డులను కైవసం చేసుకుంది. దీంతో ఏడాది వ్యవధిలో రికార్డు స్థాయిలో 36 అవార్డులను గెలుచుకొని పోలీస్ శాఖ సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ టెక్నాలజీ వినియోగంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి డీజీపీ గౌతమ్ సవాంగ్ వెబినార్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీస్ శాఖకు ఇస్తున్న ప్రాముఖ్యతతోనే సత్ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు.