గత గురువారం, డిసెంబర్
17 వ
తేదీ కాశ్మీర్ లోని అనంత్నాగ్ లోని సంగం మరియు నైనా రహదారిపై కాల్పుల్లో
పట్టుబడ్డ ఉగ్రవాది హాస్పిటల్లో చికిత్స
పొందుతూ మృతి చెందాడు. కాశ్మీర్లో ఉగ్రవాదుల బెడద ఏమాత్రం తగ్గకుండా రోజుకో
సమస్యగా తయారవుతున్నారు. పాకిస్తాన్ ప్రేరేపించడం వల్ల కాశ్మీర్లో ఉగ్రవాదులు తరచు
దాడులకు పాల్పడుతున్నారు.
ఇద్దరు ఉగ్రవాదులు బైక్పై
సంగం మరియు నైనా రహదారిపై వెళుతున్న సమయంలో మన పొలిసు బలగాలు ఆపడంతో బైక్ లో
వెనుక వున్న ఉగ్రవాది మన దళాలపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో మన భద్రత దళాల
కాల్పుల్లో ఆ ఉగ్రవాదికి గాయమవ్వడంతో అతనికి చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.
ఈ ఉగ్రవాది తీవ్ర గాయాల వల్ల చికిత్స పొందుతూ మరణించాడు. అతని వివరాలు పరిశీలిస్తే
అతను హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది గాను మరియు అతని
పేరు జహీర్ అబ్బాస్ గుర్తించబడింది.