తెలుగు దేశం పార్టీ మహిళా
సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి తలకి గాయమైంది. గుంటూరు జిల్లా తెనాలిలోని
ఆమె నివాసంలో కాలు జారి కింద పడ్డారు. దీంతో నన్నపనేని రాజకుమారి తలకు గాయమైంది.
కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన
ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చెకప్
చేయించుకున్న అనంతరం ఇంటికి చేరుకుని డాక్టర్ల పర్యవేక్షణలో నన్నపనేని చికిత్స
పొందుతున్నారు. మరోవైపు తెలుగు దేశం పార్టీ నేతలు నన్నపనేని ఆరోగ్యం గురించి
కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విచారిస్తున్నారు.