తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ సందర్భంగా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.
మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారంటూ హైకోర్టు అభిప్రాయపడింది. అయితే విచారణకు హాజరైన వైద్యశాఖ అధికారులు రాష్ర్టంలో కరోనా తగ్గుముఖం పట్టిందని కోర్టుకు తెలిపారు. దీనికి అభ్యంతరం చెబుతూ ఎక్కువ టెస్టులు చేయనప్పుడు కరోనా కేసులు ఎలా తెలుస్తాయంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వ టెస్ట్ ల్యాబ్స్ తక్కువగా ఉన్నాయని పేర్కొంది. తప్పుడు లెక్కలతో హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాగా కరోనా మరణాల్లో 26వ స్థానం..దేశంలో తక్కువ కరోనా మరణాల రేటు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండటం ఊరటనిచ్చే అంశమని వైద్య, ఆరోగ్యశాఖ ఆ నివేదికలో తెలిపింది.జాతీయ స్థాయి సగటు మరణాల రేటు 1.50 శాతముంది. ఇక దేశంలో అత్యధిక కరోనా మరణాల రేటు పంజాబ్లో ఉంది. అక్కడ వైరస్ మరణాల రేటు 3.10 శాతముంది. ఆ తర్వాత రెండోస్థానంలో నిలిచిన మహారాష్ట్రలో కరోనా మరణాల రేటు 2.60%, మూడో స్థానంలో ఉన్న గుజరాత్లో 2.40%, నాలుగో స్థానంలో నిలిచిన పశ్చిమబెంగాల్లో 1.90% ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఆ రకంగా తెలంగాణ 26వ స్థానంలో ఉంది...