డ్రగ్స్ కేసులో ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశం... తెలంగాణ హైకోర్టు


తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తును సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీకి అప్పగించాలంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

పిటీషన్‌ దాఖలు చేసి మూడేళ్లు అవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయడం లేదని రేవంత్‌ తరఫు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు.

ఈ కేసులో కౌంటర్‌ దాఖలుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది...