అక్రమంగా అరెస్ట్ చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి ..బండి సంజయ్


ఎన్నికలు అయిపోయాక కూడా బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కెసిఆర్.. ఈ విషయంలో తన వైఖరి మార్చుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

సిద్దిపేటలో బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు, చేస్తూ భయబ్రాంతులకు గురి చెయ్యడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అక్రమంగా అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చెయ్యాలని కోరారు. దుబ్బాకలో ఓటమి భయంతో మొన్నటిదాకా రోజుకో రకంగా ఇబ్బందులకు గురి చేసి.. ఓటమి తప్పదని అక్కసుతో మా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కెసిఆర్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ నాయకులకు తిప్పలు తప్పవు హితవు పలికాడు.

ఉప ఎన్నికలో దుబ్బాక సీటు తర్వాత తన సీటుకు ఎసరు వస్తున్నదన్న భయంతో కెసిఆర్, ఇదంతా చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుందని ఈమేరకు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరే ఉన్నాయని, ఆ పరిస్థితి కెసిఆర్ ప్రభుత్వం కొని తెచ్చుకోవద్దని.. జాగ్రత్తా అంటూ బండి సంజయ్ హెచ్చరించాడు