మళ్ళీ బ్యాట్ పట్టిన రైనా ....టార్గెట్ ఐపీయల్ 2021


ఐపీయల్ అనగానే అందరికి గుర్తొచ్చే ఆటగాడు సురేష్ రైనా ..మిస్టర్ ఐపీయల్ గా పేరుతెచ్చుకున్న రైనా చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో అత్యంత కీలక పాత్ర పోషించేవాడు ..

అయితే ఈ ఏడాది ఐపీయల్ లో ఆడేందుకు యూఏఈ వెళ్లిన రైనా అనుకోని కారణాల వలన ఐపీయల్ ఆడకుండానే స్వదేశానికి పయనమయి వచ్చాడు .దీనితో చెన్నై జట్టుకి రైనా లేని లోటు ఐపీయల్ లో బాగా కనిపించింది...అయితే త్వరలోనే అతను దేశవాళీ టోర్నీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడబోతున్నాడు.

యువ క్రికెటర్ ప్రియమ్ గార్గ్ కెప్టెన్సీలో ఉత్తరప్రదేశ్‌ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్న సురేశ్ రైనా.. తాజాగా నెట్స్‌లో టీమ్ సహచరులతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం రైనా మీద కోపంగా ఉన్నది అన్న వార్తలు వచ్చాయి ఒకవేళ అదే నిజమయి రైనాను వదిలేస్తే ఆక్షన్ లో నిలవాలంటే రైనా ఇప్పుడు ఫామ్ నిరూపించుకోక తప్పదు