ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి వాళ్లకు నడుమంటే వ్యామోహం అని, హీరోయిన్లను మిడ్ డ్రస్లలో చూడటానికి ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. అంతే.. ఈ ఒక్క క్లిప్పింగ్ సోషల్ మీడియాకు దొరికింది. ఆమెను వేటాడటం మొదలు పెట్టింది. మీకు అన్నం పెట్టిన తెలుగు చిత్ర పరిశ్రమను కించపర్చడానికి సిగ్గనిపించట్లేదా? అంటూ నెటిజన్లు నోటికొచ్చిన మాటలు అన్నారు..
వీటన్నింటిపై పూజా హెగ్డే స్పందించారు. తాను ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ అభిమానాన్ని కాదని చెప్పుకొచ్చారు. తనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పటికీ ప్రాణ సమానమని స్పష్టం చేశారు. ఇది తన చిత్రాలను అభిమానించే వారికీ, తన అభిమానులకు తెలిసినా.. ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే మళ్లీ చెబుతున్నానని చెప్పుకొచ్చారు. తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఓ లేఖను విడుదల చేశారు