గన్ తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య...


సికింద్రాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ లోని రాణిగంజ్ లో ఎస్ పి ఎఫ్ కానిస్టేబుల్ ఎస్ఎల్ఆర్ గన్ తో కాల్చుకోని అత్మహత్య కు పాల్పడ్డాడు.

నల్గొండ జిల్లా కు చెందిన మధు ఎస్పిఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం రాణిగంజ్ లోని బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర కార్యాలయంలో పని చేస్తున్నాడు. రాత్రి షిప్ట్ లో ఉన్న మధు..ఉదయం సమయంలో తన గన్ తో తలకు కాల్చుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శబ్ధం విని అందరు అక్కడి కి వచ్చే సారికి అప్పటికే ప్రాణలు కోల్పోయాడు.

ఆత్మహత్య కు గల కారణలను పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు కుటుంబ అంతర్గత కలహాలతో ఆత్మహత్య చేసుకుంటాడని భావిస్తున్నారు పోలీసులు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న మహాంకాళి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.