విజయవాడలో తీవ్రమైన ఎండలు


విజయవాడ నగరంలో గత 24 గంటల్లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే ఇది అత్యధికం. దేశంలోని ఏ నగరంలో కూడా గత 24 గంటల్లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఎండ తీవ్రత ఎంత అధికంగా ఉందో చెప్పేందుకు ఇది నిదర్శనం. ఈ విషయాన్ని వాతావరణ సంస్థ ధ్రువీకరించింది.

మరోవైపు నాలుగు రోజుల పాటు భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం మే 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు చేయవలసినవి, చేయకూడని పనుల గురుంచి విపత్తు నిర్వహణ శాఖ కొన్ని సూచనలు అందించింది.