మనదేశంలో శాంసంగ్ కొత్త
స్మార్ట్ టీవీ లైనప్ ను లాంచ్ చేసింది. క్రిస్టల్ 4కే అల్ట్రా హెడ్ డీ, అన్
బాక్స్ మ్యాజిక్ 3.0 సిరీస్ టీవీలు. బెజెట్ లెస్ డిజైన్, డైనమిక్
క్రిస్టల్ డిస్ ప్లే, క్రిస్టల్ 4కే ప్రాసెసర్లతో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. వీటిలో
ఓటీటీ యాప్స్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా ఉండటం విశేషం.
చైనా బ్రాండ్లు కాకుండా
ఇతర బ్రాండ్ల స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇవి మంచి ఆప్షన్లు. ఇక
వీటిలో ధర విషయానికి వస్తే శాంసంగ్ క్రిస్ట్ 4కే అల్ట్రా హెచ్ డీ టీవీ 43
అంగుళాల వేరియంట్ ధరను మనదేశంలో రూ.44,400గా నిర్ణయించారు. 50 అంగుళాల వేరియంట్ ధర రూ.60,900గా ఉండగా, 55 అంగుళాల వేరియంట్ ధర రూ.67,900గానూ, 65
అంగుళాల వేరియంట్ ధరను రూ.1,32,900గానూ,
75 అంగుళాల వేరియంట్ ధరను రూ.2,37,900గానూ నిర్ణయించారు.
అన్ బాక్స్ మ్యాజిక్ 3.0 రేంజ్
టీవీల్లో 32 అంగుళాల వేరియంట్ ధర రూ.20,900గానూ, 43
అంగుళాల వేరియంట్ ధర రూ.41,900గానూ ఉంది. వీటిపై నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా
అందుబాటులో ఉంది.
శాంసంగ్ క్రిస్టల్ 4కే
అల్ట్రా హెచ్ డీ టీవీలు 43 అంగుళాల నుంచి,
75 అంగుళాల వరకు అందుబాటులో ఉంటాయి. ఇందులో మల్టీ వ్యూ
ఫీచర్ కూడా అందుబాటులో ఉండటం విశేషం. దీని ద్వారా టీవీ స్క్రీన్ రెండు భాగాలుగా
విడిపోయి రెండిట్లో రెండు వీడియోలు ప్లే అవుతాయి.
శాంసంగ్ అన్ బాక్స్ మ్యాజిక్
3.0 టీవీల
విషయానికి వస్తే 32, 43 అంగుళాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. వాయిస్
అసిస్టెంట్స్, అమెజాన్ అలెక్సా, శాంసంగ్ బిక్స్ బీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ఇందులో ఆటో హాట్ స్పాట్, లైవ్ కాస్ట్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇందులో ఉన్న పర్సనల్ కంప్యూటర్
మోడ్ ద్వారా మీ డాక్యుమెంట్లను కూడా ఇందులో యాక్సెస్ చేయవచ్చు. ఇందులో అమెజాన్
ప్రైమ్, నెట్
ఫ్లిక్స్, జీ5
సపోర్ట్ కూడా ఉంది. స్ట్రీమింగ్ యాప్స్ కోసం ప్రత్యేకంగా ఇందులో ఒక బటన్ ను
అందించారు. వీటిలో గానా యాప్ సాయంతో ప్రత్యేకమైన మ్యూజిక్ ప్లేయర్ కూడా ఉంది.