ఈ ఏడాది హరీష్ శంకర్
డైరెక్షన్ లో టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ నటించిన మూవీ బాక్సాపీస్ వద్ద హిట్
గా నిలిచి౦ది. ఎఫ్2 చిత్రం వెంకటేశ్ తో కలిసి నటించాడు. ఈ మూవీ మంచి
టాక్ తోపాటు కలెక్షన్లను సంపాదించింది. ఎఫ్ 2 చిత్రాన్ని చేసిన
నిర్మాత దిల్ రాజు ఎఫ్3కి కూడా రెడీ
అవుతుండగా వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా
నిలిచింది.
దర్శకుడు అనిల్
రావిపూడి, వెంకటేశ్, వరుణ్
తేజ్ కు దిల్ రాజు రూ.10 కోట్ల చొప్పున పారితోషికం ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ, వరుణ్
తేజ్ కు రూ.8 కోట్లు రెమ్యునరేషన్ ఫిక్స్ అయినట్టు మరో వార్త వచ్చింది.
వరుణ్ తేజ్ ను ఈ విషయ౦లో దిల్ రాజు ఒప్పించాడట. ఈ వార్తలో ఎంత నిజ౦ ఉందొ
తెలియలేదు.