ఈ సంవత్సరం ఐపీయల్ వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు ..లొక్డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు ఆగిపోవడంతో , క్రికెట్ టోర్నీలు వాయిదా పడ్డాయి ..అయితే రాయల్ చాలెంజెర్స బెంగుళూరు జట్టు మాత్రం ..ఈ సంవత్సరం ఐపీయల్ విన్నర్ మేమె అని ట్విట్టర్ లో ప్రకటించింది ..ఐపీయల్ జరగకుండా ఆర్ సి బి విన్నర్ ఎలా అయిందా అని ఆలోచిస్తున్నారా ...ఐపీయల్ ఆగిపోవడంతో ఆర్సీబి జట్టు ఇండియన్ పోల్ లీగ్ అని ఒక కాంటెస్ట్ను నిర్వహించింది..
ఈ క్రమంలో ఆర్సీబీ వినూత్నంగా ఆలోచించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రోజువారి మ్యాచ్లకు సంబంధించి పోల్ను నిర్వహించింది. ఈ పోల్లో అత్యధిక ఓట్లు సాధించిన జట్టు ఆ మ్యాచ్లో గెలిచినట్లు. ఇలా షెడ్యూల్ ప్రకారం జరిగాల్సిన మ్యాచ్లకు పోల్ నిర్వహించి ఇండియన్ పోల్ లీగ్ను ఆర్బీబీ ఫైనల్ వరుకు నిర్విరామంగా కొనసాగించింది. ఇలా సన్రైజర్స్, ఆర్సీబీ జట్లు ఫైనల్కు చేరుకున్నాయి. ఫైనల్ పోరులో 85 శాతం ఓట్లు సాధించిన తమ జట్టు విజేతగా నిలిచిందని ఆర్సీబీ తమ అధికారిక ట్విటర్లో పేర్కొంది. ఇక దీనిపై కొందరు నెటిజన్లతో సహా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్కింగ్స్ ట్విటర్ వేదికగా స్పందించింది.