సెంట్రల్ రైల్వేతో
ఒప్పందం కుదుర్చుకున్న 27 ఏళ్ల 'వెంకటేష్ వేముగుట్టి' అనౌన్సర్ జీతం చెల్లించకపోవడంపై
గురువారం ఆత్మహత్యకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. వెంకటేష్ వేముగుట్టి తన
జీతం నెలల తరబడి చెల్లించకపోవడం ఇందువల్ల తను
విషంత్రాగడం గురించి తన బాధలను వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
అయ్యింది.
కాంట్రాక్టుపై పనిచేసే
వెంకటేష్ కు ఆరు నెలలకు పైగా జీతాలు చెల్లించలేదని తెలిసింది. కల్యాణ్లోని మహరల్
నివాసి వెంకటేష్, అతను ఆత్మహత్యాయత్నం చేయడంతో ఆసుపత్రికి తరలించామని
పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఒక అధికారి తెలిపారు. పోలీసులు ప్రస్తుతం వెంకటేష్
వాంగ్మూలం నమోదు చేస్తున్నారని ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని కల్యాణ్
తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజు వాన్జారి తెలిపారు.