పంజాబ్లో కరోనా మహమ్మారి విస్తృతి కొనసాగుతున్నది. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 1063 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో పంజాబ్లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,930కి చేరింది. అందులో 14,040 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మరో 7351 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక పంజాబ్లో కరోనా మరణాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి.
గత 24 గంటల వ్యవధిలో 23 మంది కరోనా బాధితులు మృతిచెందారు. దీంతో పంజాబ్లో మొత్తం కరోనా మృతుల సంఖ్య 539కి చేరింది. పంజాబ్ ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.