కరోనా మనదేశంలో రోజుకు
దాదాపు లక్ష కేసులు నమోదు అవుతున్నాయి. అదే స్థాయిలో కరోనా రకవరీ రేటు ఉంది. ఈ లాక్ డౌన్ సడలింపులతో వైరస్ మరింత వేగంగా
విజృంభిస్తోంది. దీంతో ఇటు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా దీని బారిన
పడుతున్నారు. కొందరు ఈ మహామ్మారి బారిన పడి కన్ను మూస్తున్నారు. 'ఇప్పటికే
కరోనా కారణంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా కారణంగా కన్నుమూశారు. తాజాగా
కరోనా కారణంగా సీనియర్ బాలీవుడ్, మరాఠీ నటిమణీ ఆశాలత వబ్గాంకర్ కన్నుమూశారు. గత
కొన్ని రోజులుగా ఆమె కరోనాతో బాధపడుతూ సతారాలోని ప్రతిభ హాస్పిటల్లో చికిత్స
తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 83 సంవత్సరాలు.
ఆశాలతకు మరాఠీలో
చేస్తోన్న ‘ఆయి మజి కలు బాయి’ టీవీ షో చేస్తుండగా ఆమెకు వారం క్రితం కరోనా వైరస్
సోకింది. ఇక టీవీ షోలో పాల్గొన్న వాళ్లందరు కూడా కరోనా టెస్టులు చేయించుకుంటే..
అందరికీ నెగిటివ్ వచ్చింది. ఆశాలతకు కరోనా నిర్ధారణ కావడంతో దర్శక,నిర్మాతలు షూటింగ్ మానేసి టీమ్ మెంబర్స్ అందురూ హోం
క్వారంటైన్లోకి వెళ్లారు. వారం రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్న ఆశాలత గత
మూడు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆశాలత విషయానికొస్తే ఆమె ముందుగా కొంకణీ సినిమాలో నటించింది. ఆ
తర్వాత మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించింది.
ఆ తర్వాత మరాఠీ ప్రసారమయ్యే పలు టీవీ సీరియల్లో అత్త, అమ్మ
పాత్రల్లో మెప్పించింది. ఆశాలత కొంకొణి, మరాఠీ, హిందీ
సినిమాల్లో కలిపి వంద చిత్రాలకు పైగా నటించారు. బాలీవుడ్తో పాటు మరాఠీ చిత్ర
పరిశ్రమ ఆమె మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.