రాష్ట్రంలోని బీపీఈడీ, డీపీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఇవాళ విడుదలచేశారు.
ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 29న రాతపరీక్షను, అందులో అర్హత సాధించిన వారికి నవంబర్ 7న దేహదారుఢ్య పరీక్షను నిర్వహించారు.
ఈ పరీక్షలకు 7,368 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది పీఈ సెట్ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహించింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్) నోటిఫికేషన్ను ఈ ఏడాది ఫిబ్రవరి 21న విడుదల చేశారు. అయితే కరోనా వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా పలుమార్లు వాయిదా పడింది.