చెన్నై సూపర్ కింగ్స్కు
చెందిన వారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన తరువాత ఆటగాళ్లు ఇతర జట్ల
కంటే వారం రోజులు ఎక్కువ క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. తరువాత కరోనా పరీక్షల్లో
అందరికీ నెగిటివ్గా నిర్ధారణ కావడంతో ఎట్టకేలకు ప్రాక్టీస్ ప్రారంభించారు.
సెప్టెంబర్ 19న ఎంఎస్ ధోని బృందం డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైతో
తలపడనుంది. ఈ నేపథ్యంలో సీఎఎస్కే
జట్టుతో కలిసి పనిచేస్తున్న బ్యాటింగ్ కోచ్ హస్సీతో చాట్ చేసిన వీడియోను
ట్విట్టర్లో పోస్టు చేసింది.
ఈ సందర్భంగా హస్సీ
మాట్లాడుతూ ...ఆటగాళ్లు శిక్షణకు చేరుకున్న తీరు పట్ల తాను సంతోషంగా ఉన్నానని, సుదీర్ఘ
విరామం కారణంగా ఆటగాళ్లు తుప్పు పట్టిన పనిముట్లలా అవుతారనుకున్నానని, కానీ
వారి ప్రదర్శన చూసి ఆశ్చర్యపోతున్నానని హస్సీ తెలిపాడు.
కరోనా కారణంగా మేము ఎక్కువ రోజులు క్వారంటైన్లో
ఉండాల్సి వచ్చింది. అందరికి కరోనా
నెగిటివ్గా నిర్ధారణ కావడంతో ఇప్పడు ప్రాక్టీస్ మొదలు పెట్టాం. సుదీర్ఘ
విరామం తరువాత కూడా మా ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారు. నేను వీరిపట్ల
చాలా సంతోషంగా ఉన్నాను అని హస్సీ అన్నారు. మా అబ్బాయిలు
ఆకట్టుకుంటున్నారు. మ్యాచ్ కోసం మేము
అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్నాం అని హస్సీ చెప్పాడు.