కరోనా వల్ల అన్ని విద్య
సంస్థలు మూతపడడంతో పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ నెలలో పరీక్షలు
నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అన్ని ఏర్పాట్లు జరుగుచున్నది.
ఉస్మానియా యునివర్సిటీ లో
సెప్టెంబర్ 15 మరియు 16వ తేదీన జరగాల్సిన బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్, బీసీఏ, బి.ఫార్మా, బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ
పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యునివర్సిటీ శుక్రవారం ఓ ప్రకటనలో
వెల్లడించింది.
ఈ పరీక్షల నిర్వహణ కొన్ని
అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్ష తేదీలను
తిరిగి త్వరలోనే ప్రకటిస్తామంది. కాగా మిగతా పరీక్షలు నిర్ణయించిన షెడ్యూల్
ప్రకారం సెప్టెంబర్ 17నే యథావిధిగా జరగనున్నట్లు పేర్కొంది.