కరోనై వైరస్ యావత్
ప్రపంచాన్ని కుదిపేసింది. దీని బారిన పడి లక్షల మంది ప్రభావితులు కాగా ఎంతో మంది మృత్యువాత పడ్డారు. అయితే ఒకసారి
కరోనా సోకిన వ్యక్తికి తిరిగి వస్తుందా? అనేది చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇందుకు
అవుననే అంటున్నాయి అధ్యయనాలు. తాజాగా బ్రిటీష్ పరిశోధకులు చేసిన పరిశోధన ప్రకారం
ఒకసారి మహమ్మారి బారిన పడిన వ్యక్తులకు కనీసం ఆరు నెలల వరకు సోకదని తేలింది.
కరోనాపై పోరాటం చేయడంలో ముందు వరుసలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలు, సంరక్షకులపై
ఆక్స్ ఫర్డ్ వర్సీటి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 51
మిలియన్లు (5.1 కోట్లు) మందికి పైగా కరోనా బారిన పడటంతో తాజా
పరిశోధన ప్రకారం వారికి కొంత భరోసా ఇవ్వనుంది పరిశోధకులు పేర్కొన్నారు.
ఇది నిజంగా శుభవార్త..
ఎందుకంటే కనీసం స్వల్పకాలకమైన కరోనా నుంచి విముక్తి లభించిందని నమ్మవచ్చు’ అని
ఆక్స్ ఫర్డ్ వర్సిటీ నఫీల్డ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పాపులేషన్ డేవిడ్ ఐర్ తెలిపారు.
ఆయన ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు. కరోనాతో తిరిగి సంక్రమించిన కేసులు SARS-CoV-2 వైరస్ వల్ల కలుగుతుంది. రోగనిరోధక శక్తి స్వల్పకాలికంగా ఉండవచ్చని, కోలుకున్న
రోగులు త్వరగా అనారోగ్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అధ్యయన ఫలితం
ప్రకారం యూకే హెల్త్ కేర్ కార్మికుల బృందంలో కరోనాకు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా
ఉన్నవారిలో తిరిగి సోకే కేసులు చాలా అరుదుగా ఉన్నాయని సూచిస్తుంది. కరోనా బారిన
పడిన చాలా మందిలో కనీసం ఆరు నెలల వరకు తిరిగి సంక్రమించే అవకాశం తక్కువ అని ఐర్
చెప్పారు. ప్రతినిరోధకాలకు పరీక్షించిన పాల్గొనేవారిలో తమకు నూతన రోగ లక్షణాలు
కనిపించలేదని ఆయన తెలిపారు.
ప్రధాన సిబ్బంది పరీక్షా
కార్యక్రమంలో భాగమైన ఈ అధ్యయనం 2020 ఏప్రిల్ - నవంబర్ మధ్య 30 వారాల
వ్యవధిలో చేశారు. దీని ఫలితాలను ఇతర శాస్త్రవేత్తలు పరిశీలించలేదు. మెడ్ రేక్సివ్
వెబ్ సైట్ లో సమీక్షకు ముందే ప్రచురించారు. అధ్యయనం సమయంలో ప్రతినిరోధకాలు లేని 11,052 మంది సిబ్బందిలో 89 మంది లక్షణాలతో నూతన ఇన్ ఫెక్షన్ అభివృద్ధి చేశారు.
అయితే యాంటి బాడీస్ ఉన్న 1246 మంది సిబ్బందిలో ఎవరూ రోగ లక్షణ సంక్రమణను అభివృద్ధి
చేయలేదు. యాంటీ బాడిస్ ఉన్న సిబ్బంది కూడా లక్షణాలు లేకుండా కరోనా పరీక్షలో
పాజిటివ్ అని తేలే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. 76 యాంటీ
బాడీస్ లేకుండా పాజిటివ్ పరీక్షించగా యాంటీ బాడిస్ ఉన్న ముగ్గురితో పోలిస్తే వారు
బాగానే ఉన్నారు. కరోనా లక్షణాలు వారిలో అభివృద్ధి చేయలేదు. ‘రక్షణ ఎంతకాలం ఉంటుందో, ఒకసారి
సోకిన వారు మళ్లీ వ్యాధి బారిన పడినట్లయితే సంక్రమణ తీవ్రత ప్రభావితం చేస్తుందో
లేదో తెలుసుకోవడానికి మేము ఈ సిబ్బందిని జాగ్రత్తగా అనుసరిస్తాం అని ఐర్
పేర్కొన్నారు.