తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా కేసులు...11 మరణాలు

తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. గత 24 గంటలుగా రాష్ట్రంలో 11 మరణాలు సంభవించాయని.. తాజాగా మరణాలతో కలిపితే మొత్తం మరణాల సంఖ్య ఇప్పటి వరకు 1,016కు చేరుకుందని ఆరోగ్యశాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది.

తెలంగాణలో 30,673 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,35,357 మంది రికవరీ అయ్యారు. కొత్తగా జీహెచ్‌ఎంసీలో 314, రంగారెడ్డిలో 174, మేడ్చల్‌లో 144, నల్గొండలో 131, సిద్దిపేటలో 121, కరీంనగర్‌లో 114, వరంగల్‌ అర్బన్‌లో 108 కేసులు నమోదయ్యాయి. కాగా.. తెలంగాణలో ఇప్పటి వరకు 23,79,950 టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో 81.02శాతం రికవరీ రేటు ఉండగా.. 0.60శాతం మరణాలు రేటు ఉంది.