మాజీ ప్రధానమంత్రి రాజీవ్
గాంధీ హత్య కేసులో నిందితురాలు తమిళనాడులోని వేలురు జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని
ఆత్మహత్యాయత్నం చేశారు. నళిని మంగళవారం ఉదయం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు ఆమె
లాయర్ తెలిపారు.
విషయం గమనించిన జైలు
సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. బెయిలు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నళిని ఇటీవల
పెరోల్పై కుమార్తె హరిత వివాహం కోసం ఆరు నెలలపాటు బయటకు వచ్చారు. పెరోల్ ముగిసిన
తర్వాత తిరిగి జైలుకు వెళ్లారు.
తోటి ఖైదీకి, నళికి
మధ్య జైలులో గొడవ జరిగిందని, దీంతో ఆ మహిళ విషయాన్ని జైలర్ దృష్టికి
తీసుకెళ్లిందని పుహళేంది తెలిపారు. ఆ వెంటనే నళిని ఆత్మహత్యకు యత్నించినట్టు
పేర్కొన్నారు.
అయితే, గతంలో
ఎప్పుడూ నళిని ఇలా ప్రవర్తించలేదని, ఇందుకు గల అసలు కారణాలు తెలుసుకుంటామన్నారు. విషయం
తెలిసిన నళిని భర్త తనను పిలిచి ఆమెను పుళల్ జైలుకు తరలించేలా చూడాలని కోరారని, త్వరలోనే
ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పుహళేంది వివరించారు.